వాగ్గేయకారుల రచనలు అమోఘం | - | Sakshi
Sakshi News home page

వాగ్గేయకారుల రచనలు అమోఘం

Dec 11 2023 12:40 AM | Updated on Dec 11 2023 12:40 AM

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి బోసురాజు  - Sakshi

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి బోసురాజు

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో నశించిపోతున్న వాగ్గేయకారుల రచనలను కాపాడుకోవాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖా మంత్రి బోసురాజు పేర్కొన్నారు. ఆదివారం కన్నడ భవనంలో కసాప ఆధ్వర్యంలో కవి బసవరాజ్‌ సబరద రాసిన వాగ్గేయకారులు పాడిన పాటల పుస్తకాలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ వాగ్గేయకారుల పదాలతో అర్థవంతంగా పాడి ప్రజలను రంజింపచేస్తున్నారన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ భాషకు పెద్ద పీట వేయాలన్నారు. రూ.50 లక్షల మేర కన్నడ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కసాప అధ్యక్షులు రంగన్న పాటిల్‌, రామణ్ణ, కాళప్ప, వెంకటేష్‌, మహంతేష్‌, చెన్నబసవ, శరణేగౌడలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement