కారు, రూ.50 లక్షల నగదు దోపిడీ | - | Sakshi
Sakshi News home page

కారు, రూ.50 లక్షల నగదు దోపిడీ

Dec 11 2023 12:38 AM | Updated on Dec 11 2023 12:38 AM

కారును పరిశీలిస్తున్న పోలీసులు  - Sakshi

కారును పరిశీలిస్తున్న పోలీసులు

మైసూరు: కేరళకు చెందిన కాంట్రాక్టర్‌పై కొడగు జిల్లాలో దోపిడీ దొంగలు దాడి చేశారు. కారు, అందులోని రూ. 50 లక్షల నగదుతో ఉడాయించిన ఘటన గోనికొప్పలు దగ్గర దేవరపుర గ్రామంలోని విరాజపేటె– మైసూరు జాతీయ రహదారిలో జరిగింది.

భార్య బంగారు నగలు కరిగించి..

వివరాలు.. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన కొడక్వాడ్‌ కోనారి హౌజ్‌వాసి శంజాద్‌, అతని స్నేహితుడు ఆప్న. శంజాద్‌ కాంట్రాక్టరుగా పనిచేస్తుంటాడు. డబ్బులు అవసరమై తన భార్య వద్ద ఉన్న బంగారు నగలను స్థానికంగా కరిగించి కడ్డీలుగా చేసి దానిని మైసూరులో అమ్మాలని వచ్చాడు. మైసూరులోని ఒక బంగారు వ్యాపారికి సుమారు 750 గ్రాముల బంగారాన్ని అమ్మేసి రూ. 50 లక్షలు తీసుకుని మినీ కూపర్‌ కారులో శుక్రవారం రాత్రి గోణికొప్పలు మీదుగా కేరళకు బయల్దేరాడు. శనివారం తెల్లవారుజామున పొన్నంపేటె తాలూకాలోని గోనికొప్పలు– దేవపుర వద్ద గూడ్స్‌ వాహనంలో సుమారు 10 నుంచి 15 మంది దుండగులు వచ్చి కారును అడ్డుకున్నారు. శంజాద్‌, అప్నను కొట్టి కారులో నుంచి బయటకు లాగివేసి కారుతో సహా పరారయ్యారు. బాధితులు గోనికొప్ప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా గాలింపు చేపట్టారు. అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని కొళతుడు వద్ద ఖాళీ కారును గుర్తించారు. దుండగులు కారును ఏమాత్రం పనికిరాకుండా ధ్వంసం చేశారు. కేసు విచారణలో ఉంది.

కొడగులో కేరళ కాంట్రాక్టరుకు షాక్‌

మైసూరులో బంగారు అమ్మి వెళ్తుండగా ఘటన

ధ్వంసమైన కారు 1
1/1

ధ్వంసమైన కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement