దొరికిన చిరుత | - | Sakshi
Sakshi News home page

దొరికిన చిరుత

Dec 11 2023 12:38 AM | Updated on Dec 11 2023 12:38 AM

నుజ్జునుజ్జయిన కారు - Sakshi

నుజ్జునుజ్జయిన కారు

తుమకూరు: తుమకూరు తాలూకాలోని ఊరుకెరెమల్ళెనహళ్ళి గ్రామంతో పాటు చుట్టుపక్కల పల్లెల్లో తిరుగుతూ ప్రజలు భయపెడుతున్న చిరుతపులి ఎట్టకేలకు దొరికింది. కొన్నిరోజుల నుంచి చిరుత గ్రామాల్లోకి చొరబడి కుక్కలను, మేకలను ఎత్తుకెళ్తోంది. దీంతో ప్రజల కంటికి నిద్ర లేకుండా చేసింది. ప్రజలు అటవీశాఖకు ఫిర్యాదు చేయడంతో కొన్నిచోట్ల బోనులు పెట్టారు. శనివారం రాత్రి ఒక బోనులో చిరుత చిక్కింది. మరో రెండు మూడు చిరుతలు సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

మినీ బస్సును ఢీకొన్న కారు

ప్రేమికులు దుర్మరణం

దొడ్డబళ్లాపురం: మినీ బస్సును కారు ఢీకొన్న ప్రమాదంలో ప్రేమికులు మృతి చెందిన సంఘటన కనకపుర తాలూకా కెబ్బహళ్లి వద్ద చోటుచేసుకుంది. దీపక్‌ (25), శైల (22)మృతి చెందినవారు. కెబ్బళ్లికి చెందిన దీపక్‌ శనివారం రాత్రి కారులో శైలతో కలిసి వస్తుండగా ముందు వెళ్తున్న మినీ బస్సును ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో విఫలమై ఢీకొంది. శైల అక్కడికక్కడే మృతి చెందగా, దీపక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరూ ప్రేమికులని తెలిసింది.

ఇద్దరికి రూ.5 లక్షల టోపీ

మైసూరులో సైబర్‌ మోసం

మెసూరు: సైబర్‌ మోసగాళ్లు ఇద్దరిని మోసపుచ్చి సుమారు రూ. 5 లక్షలు కొట్టేశారు. మైసూరు నగరంలోని కేఆర్‌ మొహల్లాకు చెందిన సునీల్‌ కుమార్‌, కువెంపు నగరకు చెందిన బీ.కె.మహాదేవ బాధితులు. సునీల్‌కుమార్‌కు దుండగులు తమ వాట్సాప్‌ గ్రూప్‌లోకి చేర్చుకున్నారు. తమ స్కీంలో డబ్బులు కడితే డబుల్‌ లాభం వస్తుందని నమ్మించి మొత్తం సుమారు 2.90 లక్షలను కాజేశారు. మరో ఘటనలో ఆన్‌లైన్‌లో పని ఇప్పిస్తామని బీ.కె.మహాదేవకు నమ్మించి అతని నుంచి 2.05 లక్షలను తమ ఖాతాకు వేయించుకొని ఫోన్లను స్విచాఫ్‌ చేశారు. బాధితులు ఇద్దరూ సెస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

కొనసాగిన ఎన్‌ఐఏ దాడులు

బనశంకరి: ఎన్‌ఐఏ అధికారులు మహారాష్ట్రతో పాటు బెంగళూరు లో నిర్వహించిన దాడుల్లో ఉగ్ర గుట్టు రట్టయింది. పాలస్తీనా హమాస్‌ ఉగ్రవాద సంస్థ జెండాలు, తుపాకులు, ల్యాప్‌టాప్‌ తదితర వస్తువులు లభించాయి. పులకేశినగరలో అనుమానిత ఉగ్రవాది అలీఅబ్బాస్‌ ఫ్లాట్‌లో, ఉర్దూ పాఠశాలలో కొంత నగదు లభించినట్లు సమాచారం. అలీఅబ్బాస్‌ను విచారించిన ఎన్‌ఐఏ అధికారులు కీలక సమాచారం సేకరించారు. బెంగళూరు, మహారాష్ట్రతో కలిపి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో సోదాల్లో అనుమానితుల వద్ద ఒక పిస్టల్‌, రెండు ఎయిర్‌ గన్స్‌, రూ. 68 లక్షల నగదు హమాస్‌ జెండాలు, ఉగ్రవాద సాహిత్యం లభించాయి.

న్యూస్‌రీల్‌

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement