మండ్య: బీజేపీ, జేడీఎస్ల కలయిక వల్ల ఎన్డీఏ బలోపేతమవుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అక్రమ పరిపాలన పైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్పాల్ గుర్జార్ చెప్పారు. ఆదివారం మండ్యలో బీజేపీ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత సంకల్ప యాత్ర ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, మోదీ పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఆ పథకాల గురించి ప్రజలకు చెప్పడంఓత పాటు వారికి అందేలా చేయడం ప్రతి ఒక్క కార్యకర్త పని అన్నారు.