చిన్న జాతరకు నీరాజనం | - | Sakshi
Sakshi News home page

చిన్న జాతరకు నీరాజనం

Published Wed, Nov 29 2023 1:42 AM | Last Updated on Wed, Nov 29 2023 1:42 AM

ఆలయం ముందు రథోత్సవ సంరంభం  - Sakshi

ఆలయం ముందు రథోత్సవ సంరంభం

మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మైసూరు జిల్లాలోని నంజనగూడులో వెలసిన శ్రీకంఠేశ్వర (నంజుండేశ్వర) స్వామి చిన్న జాతర వేడుకలు జన సాగరం మధ్య జరిగాయి. చిన్న జాతర వేడుకల సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున ఆలయంలో పార్వతీ సమేత శ్రీకంఠేశ్వర స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాలతో అభిషేకించారు. మహావ్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకులు నాగచంద్ర దీక్షిత్‌ ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు గావించారు. గణపతి పుజ, నవగ్రహాల పూజ చేసి ఉత్సవమూర్తిని తేరులో ఉంచి రథోత్సవం ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంతో పాటు పట్టణ వీధుల్లో భక్తులు తేరును లాగారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.

జనసాగరమైన నంజనగూడు

No comments yet. Be the first to comment!
Add a comment
పట్టణ వీధుల్లో సాగిన తేరు 1
1/1

పట్టణ వీధుల్లో సాగిన తేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement