నగరంలో గాంధీ జయంతి | - | Sakshi
Sakshi News home page

నగరంలో గాంధీ జయంతి

Oct 3 2023 1:16 AM | Updated on Oct 3 2023 1:16 AM

జ్యోతి వెలిగిస్తున్న మంత్రి బోసురాజు  
 - Sakshi

జ్యోతి వెలిగిస్తున్న మంత్రి బోసురాజు

రాయచూరు రూరల్‌: నగరంలో మహత్మా గాంఽధీ , మాజీ ప్రధాని శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. సోమవారం నగరంలోని గాంధీ విగ్రహానికి మంత్రి బోసురాజు, ఎమ్మెల్యే శివరాజ్‌ పాటిల్‌ నివాళి అర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ చంద్రశేఖర్‌ నాయక్‌, ఎస్పీ నిఖిల్‌, కమిషనర్‌ గురుసిద్దయ్య, నగరసభ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వార్త శాఖ ఏర్పాటు చేసిన గాంధీజీ గ్యాలరీని మంత్రి ప్రారంభించారు.

శాస్త్రి, గాంధీలకు మంత్రి నివాళి

నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మహత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు ఘనంగా నివాళి అర్పించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మంత్రి బోసురాజు నేతల చిత్రపటాలకు నివాళి అర్పించి మాట్లాడుతూ... స్వాతంత్రం కోసం పోరాడిన నేత గాంధీజీ, హరిత విప్లవానికి నాంది పలికిన శాస్త్రిలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు బసవరాజ రెడ్డి, నగర సభ సభ్యులు జయన్న, జిందప్ప, మాజీలు రుద్రప్ప, శివమూర్తి, శాంతప్ప, జయంతిరావ్‌ పతంగి, తాయన గౌడ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement