వ్యాస రచన పోటీలు | - | Sakshi
Sakshi News home page

వ్యాస రచన పోటీలు

Oct 3 2023 1:16 AM | Updated on Oct 3 2023 1:16 AM

హొసపేటె: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాపూజీ వ్యాసరచన పోటీలలో విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలను జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ అందించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైస్కూల్‌, ప్రీ గ్రాడ్యుయేషన్‌, గ్రాడ్యుయేషన్‌ విభాగాల విద్యార్థులకు తొలిసారిగా నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు.

మహిళా రిజర్వేషన్లు హర్షనీయం

గంగావతి: మహిళలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళా నేతలు పిలుపునిచ్చారు. కారటగి పట్టణంలో పలు మహిళా సంఘాల వారు కలిసి మహిళా రిజర్వేషన్‌ విజయోత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు పరుషులతో సమానంగా ప్రతి విషయంలోను అవకాశాలను కల్పించాలని, భవిష్యత్‌లో రాజకీయాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 33 శాతం రిజర్వేషన్‌ మహిళలకు కల్పిస్తూ చట్టాన్ని తీసుకురావడం హర్షనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement