
పాధ్యాయులను సన్మానిస్తున్న దృశ్యం
సాక్షి,బళ్లారి: జిల్లాలో ఎన్నో ఏళ్లుగా మరుగున పడిన గురుభవన్ నిర్మాణాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని, ఇందుకు రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసి ఉపాధ్యాయుల ఆశయాలకు అనుగుణంగా భవన నిర్మాణం జరుగుతుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాగేంద్ర పేర్కొన్నారు. మంగళవారం జెడ్పీ, విద్యా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల కృషి వల్లే దేశాభివృద్ధి సాధ్యమని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. ఉపాధ్యాయ స్థాయి నుంచి రాష్ట్రపతి దాకా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు బావిభారత పౌరులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. తల్లి, తండ్రి తర్వాత గురువు స్థానం ఎంతో గొప్పదన్నారు. అలాంటి గురువులు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపుతున్నారన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపమేయర్ బి.జానకి, హనుమక్క, ఎం.శివాజీరావ్ తదితరులు పాల్గొన్నారు.