
గురు విశ్వకర్మ
రాయచూరు రూరల్: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ఇప్పిస్తామని చైత్రా కుందాపుర గ్యాంగ్ వసూళ్ల కేసు కనుమరుగు కాక ముందే మంత్రి పేరుతో ఆప్త సహాయకుడు ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులకు రూ.కోట్లలో శఠగోపం పెట్టిన ఘటన జిల్లాలో వెలుగు చూసింది. రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఎస్.బోసురాజు ఆప్త సహాయకుడినని చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్న గురు విశ్వకర్మ నిజస్వరూపం బయటపడింది. అతనిపై అంగన్వాడీ, ఎస్ఐ, ఎఫ్డీసీ, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానని 28 మంది నుంచి అడ్వాన్స్గా రూ.2 కోట్లు వసూలు చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాము గురు విశ్వకర్మను ఇప్పటికే తమ వద్ద విధుల నుంచి తొలగించామని మంత్రి బోసురాజు విలేకరులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం అతను మాజీ ఎంపీ బీవీ నాయక్తో, బీజేపీలో గుర్తింపు పొందారన్నారు.
మంత్రి పేరు చెప్పి దందా