
నీట మునిగిన వీరాంజనేయ ఆలయం
రాయచూరు రూరల్: గత రెండు రోజుల నుంచి యాదగిరి జిల్లాలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో భీమా నదికి వరద పోటెత్తింది. కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, రాయచూరు జిల్లాల్లో పూర్తి స్థాయిలో వరద నీరు చేరడంతో భీమా నదిలోకి 5 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. యాదగిరి జిల్లా గురుసణిగి వద్ద ఆరు గేట్లను తెరిచారు. నదీ తీర ప్రాంతంలోని వీరాంజనేయ, కంగాళేశ్వర ఆలయాలు నీట మునిగాయి. నదీ పరివాహక జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపిక
కంప్లి: పట్టణంలోని 6వ వార్డు ప్రభుదేవర సంస్థాన విరక్తమఠం పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న కే.నవ్య, కే.పూజ యోగా పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఎం అరుధంతి ఇరువురిని అభినందిస్తూ ప్రతి విద్యార్థిని యోగా పట్ల ఆసక్తి చూపి ఇలా రాష్ట్ర స్థాయికి ఎంపికై పాఠశాల కీర్తిని పెంచాలని కోరారు.

ప్రశంసాపత్రాన్ని అందిస్తున్న దృశ్యం