హొసపేటె: ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగం ఎంత అభివృద్ధి చెందినా పరిసరాల పరిశుభ్రతపైనే మనిషి ఆరోగ్యం, ఆయుష్షు ఆధారపడి ఉంటుందని కాంగ్రెస్ నేత హెచ్ఎన్.మహ్మద్ ఇమామ్ నియాజీ అన్నారు. ఆయన శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన పౌరకార్మిక దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. పరిశుభ్రత కాపాడడంలో మున్సిపల్ పౌర కార్మికుల పాత్ర ప్రముఖం అన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రూపేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బి.టి.బండివడ్డర, జి.నీలకంఠ, సుంకప్ప, బి.సతీష్, బీ.కృష్ణమూర్తి, ఖాజా హుస్సేన్, బీ.మారెన్న, జగన్నాథ్, విజయ్కుమార్, సల్మాన్, బిఎం నాగేంద్రలతో పాటు వందలాది మంది పౌరకార్మికులు పాల్గొన్నారు.