మహిళ అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

మహిళ అనుమానాస్పద మృతి

Sep 24 2023 1:02 AM | Updated on Sep 24 2023 1:02 AM

మృతురాలు
సత్య చెలగి  - Sakshi

మృతురాలు సత్య చెలగి

చెళ్లకెరె రూరల్‌: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని నెహ్రు సర్కిల్‌ సమీపంలోని ఆంజనేయ టెక్స్‌టైల్స్‌ ఎదురుగా గల ఇంటిలో శనివారం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న మహిళను బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా దాసాపుర గ్రామానికి చెందిన లీలావతి, జడియప్పల కుమార్తె సత్య చెలగి(25)గా గుర్తించారు. మూడేళ్ల క్రితం చెళ్లకెరెకు చెందిన ప్రజ్వల్‌ చెలగితో సత్యకు వివాహమైంది. రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇది పథకం ప్రకారం జరిగిన హత్య అని కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం అవుతోంది. మద్యానికి బానిస అయిన భర్త ప్రజ్వల్‌ చెలగినే ఉరి వేసి ఉంటాడని ఆమె సోదరుడు కిషోర్‌ ఆరోపిస్తున్నాడు. ఆమె మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, సోదరుడు ఆవేదనతో చలించి పోయారు. ఘటన స్థలానికి డీఎస్పీ రాజన్న వెళ్లి పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement