సాగునీటి కోసం రైతు ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి కోసం రైతు ఆత్మహత్యాయత్నం

Sep 24 2023 1:02 AM | Updated on Sep 24 2023 1:02 AM

సాక్షి,బళ్లారి: ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంట పొలాలకు నీరు విడుదల చేయాలని రైతు సంఘం నేతలు చేపట్టిన ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వీడియో వైరల్‌గా మారింది. శనివారం దావణగెరె జిల్లా హరిహర తాలూకా మలెబెన్నూరులో రైతులు భద్రా జలాశయం నుంచి పంటలకు నీరు విడుదల చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన, ర్యాలీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో తక్షణం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పరీక్షించిన వైద్యులు ప్రాణాపాయం లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement