సాక్షి,బళ్లారి: ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంట పొలాలకు నీరు విడుదల చేయాలని రైతు సంఘం నేతలు చేపట్టిన ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వీడియో వైరల్గా మారింది. శనివారం దావణగెరె జిల్లా హరిహర తాలూకా మలెబెన్నూరులో రైతులు భద్రా జలాశయం నుంచి పంటలకు నీరు విడుదల చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన, ర్యాలీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో తక్షణం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పరీక్షించిన వైద్యులు ప్రాణాపాయం లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.