ఉద్యమించిన రైతు రక్షణ సంఘం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమించిన రైతు రక్షణ సంఘం

Sep 18 2023 1:02 AM | Updated on Sep 18 2023 1:02 AM

ఆందోళనకారులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు   - Sakshi

ఆందోళనకారులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

హోసూరు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు కర్ణాటక ప్రభుత్వం కావేరి నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ రైతు రక్షణ సంఘం ఉద్యమించింది. హోసూరు – బెంగళూరు జాతీయ రహదారి సరిహద్దు జూజువాడి వద్ద నాయకులు ఆదివారం ధర్నా నిర్వహించారు. కావేరి నీటి సరఫరా ఆగిపోవడంతో డెల్టా ప్రాంత రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అయినప్పటికీ రాజకీయ పార్టీల నాయకులు మౌనం పాటిస్తున్నాయని మండిపడ్డారు. కావేరి నీటి సమస్యను పరిష్కరించేంత వరకు ఆందోళనలు విరమించబోమని పట్టుబట్టారు. కాగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. అనంతరం వదలిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement