
మాట్లాడుతున్న మంత్రి బోసురాజు
రాయచూరు రూరల్: జిల్లాలోని హాస్టళ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు అక్కడ నెలకొన్న సమస్యలను అధికారులు తీర్చాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖా మంత్రి ఎన్ఎస్ బోసురాజు అధికారులకు సూచించారు. ఆయన శనివారం జెడ్పీ జల నిర్మల సభాంగణంలో జరిగిన వెనుక బడిన, సాంఘీక సంక్షేమ శాఖ, మైనార్టీ, మొరార్జి దేశాయి, ఏకలవ్య వసతి శాఖ అధికారుల సమావేశంలో మాట్లాడారు. హాస్టల్ భవనాల నిర్మాణాలపై పూర్తి నివేదిక అందించాలని ఆదేశించారు. హాస్టళ్లలో తాగునీరు, విద్యుత్, భోజన వసతి వంటి సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్, ఏడీసీ దురుగేష్, ఏసీ మెహబూబీ, జెడ్పీ సీఈఓ రాహుల్ పాండే తుకారాం, ఉప కార్యదర్శి శశికాంత్, ప్రకాష్, జెెస్కాం చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ దేశాయి, విద్యా శాఖాధికారి సురేష్, బీసీఎం అధికారి వాల్మీకి, సాంఘీక సంక్షేమ శాఖాధికారి రాజేంద్ర జాలదార్లున్నారు.