దంపతుల కలహం శాంతిభద్రతల సమస్యా? | - | Sakshi
Sakshi News home page

దంపతుల కలహం శాంతిభద్రతల సమస్యా?

Sep 17 2023 6:08 AM | Updated on Sep 17 2023 8:26 AM

- - Sakshi

హుబ్లీ: ఇంట్లో పూజ చేసే విషయమై భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ కేసులో భర్తపై క్రిమినల్‌ కేసులు పెట్టిన తీరుపై ధార్వాడ హైకోర్టు తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఆ చార్జ్‌షీట్‌ను కోర్టు రద్దు చేసింది. కేసు రద్దును కోరుతూ బాగలకోటె విద్యాగిరి నివాసి వివేకానంద దాఖలు చేసిన రిట్‌ విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.నాగప్రసన్నతో కూడిన ఏకసభ్య ధర్మాసన ధార్వాడ పీఠం ఈ ఆదేశాలను వెలువరించింది.

ఏం జరిగిందంటే..

ఫిర్యాదిదారుకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 2016లో శ్రావణ శుక్రవారం రోజున పూల సామగ్రి కొనాలని భార్య కోరగా ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. దీనికి సంబంధించి భార్య బాగలకోటె నవనగర పోలీస్‌ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేయగా, పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు అన్యాయమంటూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు.

ఈ కేసులో దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. దీని వల్ల సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిందని చెబుతూ క్రిమినల్‌, బెదిరింపుల సెక్షన్‌ చేర్చడం సరికాదని కోర్టు అభిప్రాయ పడింది. కుటుంబ కలహానికి ఇలాంటి కేసులు పెట్టడం తమాషాగా ఉందని జడ్జి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement