‘భౌ’తిక దాడులతో జనం బెంబేలు

కుక్కల దాడిలో చిన్నారి చేతికి గాయం     గాయపడిన చిన్నారి  - Sakshi

తుమకూరు : తుమకూరు జిల్లా తిపటూరు తాలూకాలోని రంగాపుర గ్రామంలో వీధిశునకాల బెడద తీవ్రంగా మారింది. మందలుగా సంచరిస్తూ రోడ్లపై వెళ్తున్న వృద్ధులు, చిన్నారులపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో రోడ్డుపైకి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. గ్రామంలోని గాంధీనగర, అరసు నగర, చాముండేశ్వరి నగరలో శునకాల బెడద తీవ్రంగా ఉంది. ఆదివారం నుంచి ఇప్పటివరకు ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. రంగాపుర రోడ్డులో నివాసం ఉంటున్న 8 సంవత్సరాల నూరాని బాను, 8 సంవత్సరాల షరీఫ్‌, సిద్దిక్‌ అనే బాలుడు కుక్కలదాడిలో తీవ్రంగా గాయపడ్డారు. వీధిశునకాలను నియంత్రించాలని కోరుతున్నా నగరసభ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి కుక్కల సంతతిని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

కుక్కల సంతతి నియంత్రణలో అధికారులు విఫలం

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top