
రవి మృతదేహం
● ప్రశ్నించిన యువకుడిపై బీర్బాటిల్తో దాడి
● కేరళ యువకుల వీరంగం
బనశంకరి: యువతి దుస్తులు, శరీర ఆకృతిపై అసభ్యంగా మాట్లాడటమే కాకుండా ప్రశ్నించిన యువకుడిపై కేరళకు చెందిన యువకులు బీర్బాటిల్తో దాడి చేశారు. ఈఘటన బెంగళూరులోని కొత్తనూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తిలక్ అనే యువకుడు తన బంధువైన సంధ్యాకుమార్తో కలిసి కొత్తనూరులోని ఒయూ పబ్కు వెళ్లారు. ఈ సమయంలో యువతి పట్ల కేరళకు చెందిన ముగ్గురు యువకులు అసభ్యకరంగా వ్యవహరించారు. ఈ విషయంపై ప్రశ్నించిన తిలక్ను అసభ్యపదజాలంతో దూషించి బీర్బాటిల్తో దాడిచేసి అంతుచూస్తామని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఏనుగు దాడిలో వ్యక్తి మృతి
మైసూరు: ఏనుగు దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా సరగూరు తాలూకా బీ. మట్టకెరె గ్రామంలో చోటు చేసుకుంది. హిరెహళ్లికి చెందిన రవి కుమార్ అనే వ్యక్తి సీగేవాడి ఎనే అడవి సమీపంలోని తన పొలానికి వెళ్లాడు. ఆహారం కోసం వచ్చిన ఏనుగు అతనిపై దాడి చేసి కాళ్లతో తొక్కి హతమార్చింది. అటవీశాఖ అధికారులు, పోలీసులు వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
యడియూరప్పతో బొమ్మై భేటీ
బనశంకరి: శాసనసభలో ప్రతిపక్షనేత ఎంపికపై చర్చించేందుకు బీజేపీ సీనియర్ నేత యడియూరప్పతో మాజీ సీఎం బసవరాజ బొమ్మై శుక్రవారం భేటీ అయ్యారు. ప్రతిపక్ష స్థానం ఎవరికి అప్పగించాలనే దానిపై చర్చలు జరిపారు. కానీ ఎలాంటి నిర్ణయానికి రాలేదు. నూతన నేత ఎంపిక ప్రక్రియ త్వరగా ముగించాలని చర్చించారు. గతంలో ఉపనేతగా ఉన్న ఆర్.అశోక్, సీనియర్ ఎమ్మెల్యే బసవగౌడపాటిల్ యత్నాళ్, సునీల్కుమార్తో పాటు కొందరు ప్రతిపక్షస్థానం కోసం లాబీయింగ్ చేస్తున్నారు. అయితే బొమ్మైను కొద్దిరోజుల పాటు కొనసాగించాలని తీర్మానించినట్లు సమాచారం.
పెళ్లి సందడి
యశవంతపుర: దివంగత నటుడు అంబరీశ్ ఇంటిలో పెళ్లి సందడి మొదలైంది. అంబరీశ్, ఎంపీ సుమలత దంపతుల కుమారుడు అభిషేక్ వివాహం వధువు అవివా బిడ్డప్పతో ఈనెల 5న ప్యాలెస్ మైదానంలో జరగనుంది. ఇందులో భాగంగా శుక్రవారం శాస్త్రబద్ధంగా పసుపుశాస్త్రం కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.

బీఎస్.యడియూరప్పతో సమావేశమైన బసవరాజ బొమ్మై

పసుపుశాస్త్రంలో అభిషేక్

మృతుడు రవి(ఫైల్)