యశవంతపుర: బస్ను ఏనుగు అడ్డుకొని దంతాలతో పొడిచి బీభత్సం సృష్టించింది. దీంతో ప్రయాణికులు భీతిల్లారు. వివరాలు... కేఎస్ ఆర్టీసీ స్లీపర్ కోచ్ బస్సు గురువారం రాత్రి దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు నుంచి కాణియూరు, సుబ్రహ్మణ్య మార్గంలో బెంగళూరుకు బయల్దేరింది. అర్ధరాత్రి సమయంలో కెంద్యాల గ్రామం వద్ద ఏనుగు అడ్డుగా వచ్చింది. దంతాలతో బస్బాడీని పొడిచి బీభత్సం సృష్టించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాక్యచక్యంతో బస్ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లి నిలిపివేశాడు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారి రాఘవేంద్ర సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఏనుగు అక్కడినుంచి వెళ్లిన అనంతరం బస్ బెంగళూరుకు బయల్దేరింది.