మనోశుద్ధితో లక్ష్య సిద్ధి | - | Sakshi
Sakshi News home page

మనోశుద్ధితో లక్ష్య సిద్ధి

Jun 3 2023 12:22 AM | Updated on Jun 3 2023 12:22 AM

ప్రతిభా పురస్కారాలను అందించిన దృశ్యం    - Sakshi

ప్రతిభా పురస్కారాలను అందించిన దృశ్యం

మాలూరు: మరొకరిపై ద్వేషం, అసూయ, చెడు ఆలోచనలను చేయకుండా విద్యార్థుల మనస్సు పరిశుద్ధంగా ఉంటే జీవితంలో లక్ష్యాన్ని సాధించవచ్చని నివృత్త ప్రధానోపాధ్యాయుడు మునియల్లప్ప తెలిపారు. ఆయన శుక్రవారం లక్కూరు జూనియర్‌ కళాశాల గడినాడు సాంస్కృతిక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో 2022–23వ విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పాఠశాలల్లో మౌల్యాధారిత ఉన్నత విద్యాభ్యాసంతో ఉత్తమ జీవితాన్ని రూపొందించుకోవాలన్నారు. పటిష్ట దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలన్నారు. తద్వారా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బి మునియప్ప, రాష్ట్ర అనికేతన సాంస్కృతిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె మునికృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement