రాయితీలను సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

రాయితీలను సద్వినియోగం చేసుకోండి

Jun 3 2023 12:18 AM | Updated on Jun 3 2023 12:18 AM

హోసూరు: హోసూరు తాలూకాలో వ్యవసాయ శాఖ ద్వారా అందజేసే రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని హోసూరు వ్యవసాయ శాఖ ఉపడైరక్టర్‌ భువనేశ్వరి ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వినతిపత్రంలో హోసూరు తాలూకాలో ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, ఈ ఖరీఫ్‌ సీజన్‌లో హోసూరు తాలూకాకు చెందిన రైతులు సుమారు 6 వేల హెక్టార్లలో రాగి పంట సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారని, ఇందుకోసం హోసూరు వ్యవసాయ శాఖ కార్యాలయం రైతులకు సరిపడ 18 టన్నుల మేలురకమైన రాగి విత్తనం, 7 టన్నుల కంది సిద్ధంగా ఉంచినట్లు, 50 శాతం రాయితీతో అందజేస్తున్నామని, వేరుసెనగ 1600 కిలోల విత్తనం నిలువ ఉంచామని, విత్తనంతో పాటు 50 శాతం రాయితీతో ఎరువులు వినియోగం చేస్తామని, చిన్నసన్నకారు రైతులకు ప్రధాన మంత్రి బిందుసేద్యం ద్వారా 100 శాతం రాయితీతో బిందుసేద్యం ఉపకరణాలు, ఇతరులకు 75 శాతం రాయితీతో ఉపకరణాలు, విద్యుత్‌ మోటార్‌, డీజిల్‌ పంప్‌సెట్‌, పైప్‌లైన్‌, వర్షపునీటి సేకరణ తొట్టీలకు 50 శాతం రాయితీ కల్పిస్తుందని, దీంతో పాటు ప్రధాని పంటల బీమా పథకం ద్వారా రైతులకు బీమా అందజేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement