సోదరి మరణాన్ని జీర్ణించుకోలేక.. | - | Sakshi
Sakshi News home page

సోదరి మరణాన్ని జీర్ణించుకోలేక..

Jun 3 2023 12:18 AM | Updated on Jun 3 2023 12:18 AM

ఆత్మహత్య  చేసుకున్న             వేణుగోపాల్‌  - Sakshi

ఆత్మహత్య చేసుకున్న వేణుగోపాల్‌

మండ్య: సోదరి మరణాన్ని తట్టుకోలేక ఓ వైద్యుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా కుదరగుండి గ్రామంలో చోటు చేసుకుంది. మండ్య సమీపంలోని స్యంజో ఆస్పత్రిలో వైద్యుడుగా పనిచేస్తున్న వేణుగోపాల్‌ (57) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఆయన సోదరి మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర మనో వేదనతో ఉన్నారు. గురువారం రాత్రి ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన వేణుగోపాల్‌ గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement