సోదరి మరణాన్ని జీర్ణించుకోలేక..
మండ్య: సోదరి మరణాన్ని తట్టుకోలేక ఓ వైద్యుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా కుదరగుండి గ్రామంలో చోటు చేసుకుంది. మండ్య సమీపంలోని స్యంజో ఆస్పత్రిలో వైద్యుడుగా పనిచేస్తున్న వేణుగోపాల్ (57) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఆయన సోదరి మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర మనో వేదనతో ఉన్నారు. గురువారం రాత్రి ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన వేణుగోపాల్ గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.