నివృత ఉద్యోగికి సత్కారం

- - Sakshi

కెలమంగలం: రహదార్ల శాఖలో సేవలందజేస్తూ పదవీ విరమణ పొందిన ఇంజినీర్‌కు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. రహదార్ల శాఖ హోసూరు డెప్యూటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సెందిల్‌కుమార్‌ శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓప్రైవేట్‌ మహాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డెంకణీకోటకు చెందిన సామాజిక సేవాకర్త, డెంటల్‌ డాక్టర్‌ సుబ్రమణ్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోసూరు, డెంకణీకోట ప్రాంతాల్లో ఇంజనీర్‌ సెందిల్‌కుమార్‌ ఉత్తమ సేవలందజేశారని అన్నారు. ఈ సందర్భంగా అయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డెంకణీకోటకు చెందిన డి.ఎస్‌ పాండ్యన్‌, ఆరిఫ్‌ఉల్లా, సూర్య, వెంకటరాజ్‌, రహదార్ల శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జమాబందీలో సమస్యల వెల్లువ

కెలమంగలం: క్రిష్ణగిరి జిల్లాలోని తాలూకా కేంద్రాల్లో శుక్రవారం జమాబందీ కార్యక్రమాలను నిర్వహించారు. డెంకణీకోట తాలూకా కార్యాలయంలో హోసూరు సబ్‌కలెక్టర్‌ శరణ్య అధ్యక్షతన జమాబందీ కార్యక్రమం జరిగింది. తాలూకాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సమస్యలపై ఫిర్యాదులు చేశారు. తహసీల్దార్‌ శరవణకుమార్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top