
ఎన్.ఎస్.బోసురాజు
రాయచూరు రూరల్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయచూరు నగర నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ బోసురాజుకు అనివార్య పరిస్థితుల్లో ఆ స్థానాన్ని తమకే కేటాయించాలని మైనార్టీలు పట్టుబట్టడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా తగిన ప్రాతినిథ్యం కల్పిస్తామని ఏఐసీసీ స్థాయిలో జరిగిన ఒప్పందం మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఎన్.ఎస్.బోసురాజుకు మంత్రి పదవిని కట్టబెట్టింది. 1972–1976 మధ్యలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1976–80 వరకు తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1980–91 మధ్య జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 1991–2000 వరకు రాయచూరు, కొప్పళ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2009–2017 వరకు కేపీసీసీ ఉపాధ్యక్షుడిగా, 2018 నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
శాసనసభ్యుడిగా
బోసురాజు నేపథ్యం..
1985లో మాన్వి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన బోసురాజు తన ప్రత్యర్థి చేతిలో కేవలం 3700 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అనంతరం 1999–2004 మధ్యలో మాన్వి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి ఎమ్మెల్సీగా వ్యవహరించారు. గత ముఖ్యమంత్రులు బంగారప్ప, వీరప్ప మొయిలీల హయాంలో కాడా అధ్యక్షుడిగా, ఎస్ఎం కృష్ణ హయాంలో హైదరాబాద్ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా, ధరంసింగ్ హయాంలో ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
చిరకాలం తర్వాత జిల్లాకు మంత్రి పదవి
వెనుకబడిన రాయచూరు జిల్లాకు రెండు దశాబ్దాల అనంతరం మంత్రి భాగ్యం లభించింది. 2002లో ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ హయాంలో జిల్లాలోని రాయచూరు రూరల్(కల్మల) నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న రాజా అమరేశ్వర నాయక్ అప్పట్లో మంత్రిగా పని చేశారు. అనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో జిల్లా వాసులకు అమాత్య పదవులు కేటాయించలేదు. 2018లో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్లో సింధనూరు ఎమ్మెల్యే వెంకటరావు నాడగౌడ మాత్రమే ఏడాది పాటు మంత్రిగా పని చేశారు.
సీనియారిటీకి అధిష్టానం పట్టం
సీనియారిటీకి అధిష్టానం పట్టం