బైక్‌ ప్రమాదంలో ఎన్‌ఎస్‌జీ కమాండో మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ప్రమాదంలో ఎన్‌ఎస్‌జీ కమాండో మృతి

May 25 2023 7:10 AM | Updated on May 25 2023 7:12 AM

కమాండో డీపక్‌ (ఫైల్‌) - Sakshi

కమాండో డీపక్‌ (ఫైల్‌)

యశవంతపుర: బైకు నుంచి జారిపడడంతో జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ)లో బ్లాక్‌ క్యాట్‌ కమాండోగా పని చేస్తున్న జవాన్‌ మృతి చెందారు. చిక్కమగళూరు జిల్లా తరీకెరె తాలూకా తణిగేబైలుకు చెందిన దీపక్‌ (31) ఎన్‌ఎస్‌జీలో పని చేస్తున్నారు. నెలరోజుల పాటు సెలవు పెట్టి సొంతూరుకు వచ్చారు. నెల రోజులు ఇక్కడ ఉండాలి కాబట్టి సరదాగా తిరగడానికని సొంతంగా ఒక బైకును కొన్నారు. సెలవులు ముగియడంతో బైకుపై చిక్కమగళూరు నుంచి బెంగళూరుకు బయలుదేరారు.

బెంగళూరుకు దగ్గరలో వర్షాల వల్ల రోడ్డు అధ్వానంగా ఉన్నచోట బైకు జారిపడడంతో దీపక్‌కు తలకు తీవ్ర గాయాలై మృతి చెందారు. ఆర్మీలో చేరి ఉత్తమ పనితీరు కనబరచిన దీపక్‌ను ఉన్నతాధికారులు దేశంలో అత్యంత ప్రముఖుల భద్రతను పర్యవేక్షించే ఎన్‌ఎస్‌జీ కమాండోగా ఎంపిక చేశారు. కఠినమైన శిక్షణ కూడా పూర్తిచేసుకుని ఇటీవలే అందులో చేరారు. కానీ అంతలోనే విధి చిన్నచూపు చూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement