Sakshi News home page

సమస్యల ‘వాణి’ కి అందిన 400 దరఖాస్తులు..

Published Tue, Oct 10 2023 11:29 AM

400 Applications Received For Program Vani - Sakshi

కరీంనగర్‌: కలెక్టరేట్‌ సముదాయంలో సోమవారం జనసందోహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవుతుందన్న సమాచారంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి, తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అత్యధికంగా భూ సమస్యలు, పింఛన్లు, రేషన్‌ కార్డులు, దళిత బంధు, డబుల్‌ బెడ్రూం ఇళ్లకు సంబంధించి 400కు పైగా దరఖాస్తులు రాగా ఆన్‌లైన్, మాన్యువల్‌గా స్వీకరించారు. కలెక్టర్‌ బి.గోపి, అదనపు కలెక్టర్లు ప్రపుల్‌ దేశాయ్, లక్ష్మీకిరణ్‌ పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు.

భూమి విషయంలో బెదిరిస్తున్నడు
ఏళ్లుగా భూమిని అనుభవిస్తున్నం. పంటల సాగుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నం. కానీ మా భూమితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అతని భూమి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నడు. సర్వే నంబర్‌ 126బి/3, 126ఎ/3 తదితర సర్వే నంబర్లలో మా భూమి ఉంది. అధికారులు న్యాయం చేయాలి.– బండారి కుటుంబసభ్యులు, చామనపల్లి, కరీంనగర్‌ రూరల్‌

పట్టాదారు పేరు మార్చండి
చల్లూరు గ్రామంలో సర్వే నంబర్‌ 91, 728/2లో మూడెకరాల భూమి ఉంది. భూ రికార్డుల్లో తాతల కాలం నుంచి మేమే ఉన్నాం. కానీ సంబంధం లేని వ్యక్తి పేరిట మార్చారు. ఈ విషయంలో గత కొన్నేళ్లుగా తహసీల్దార్, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. అయినా స్పందన లేదు. అధికారులు మోకాపై విచారణ జరిపి, న్యాయం చేయాలి.
– గాజుల ప్రసాదరావు, చల్లూరు, వీణవంక

వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వాలి
మాది కరీంనగర్‌లోని 42వ డివిజన్‌. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు.
– బాసం మల్లయ్య, ప్రశాంత్‌నగర్, కరీంనగర్‌

వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వాలి
మాది కరీంనగర్‌లోని 42వ డివిజన్‌. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు.
– బాసం మల్లయ్య, ప్రశాంత్‌నగర్, కరీంనగర్‌

పరిహారం ఇయ్యలే..
మాది కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామం. మా ఇల్లు ఎస్సారెస్పీ ముంపునకు గురైంది. సర్వే నంబర్‌ 271లో ఇంటి నంబర్‌ 10–84 కాగా పరిహారం ఇచ్చే సమయంలో నా సోదరికి పక్షవాతం రావడంతో ఆస్పత్రిలో ఉన్నారు. అధికారులు కాలయాపన చేస్తున్నరు.
– గడ్డం ఆంజనేయులు, రేకుర్తి, కరీంనగర్‌

Advertisement

What’s your opinion

Advertisement