మహాత్మా.. నా పేరు నేరేడుకొమ్మ వేదశ్రీ, కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శేడ్లో సర్వే నంబర్ 98లో 8.24ఎకరాల భూమి ఉంది. సదరు భూమి నుంచి 1.17 ఎకరాల భూమిని ఎస్సారెస్పీ కెనాల్ కింద పోయింది. భూమి ఎవరి పేరున ఎంతెంత పోయిందో చూసి తొలగించాల్సి ఉండగా అధికారులు అలా చేయలేదు. దీంతో కొందరు మా భూమిని ఆక్రమించుకుని అమ్ముకుంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను కలిస్తే పట్టించుకోవడం లేదు. జర మీరైనా అధికారుల మనసు మార్చరూ అంటూ కలెక్టరేట్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.


