పెన్షనర్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల నిరసన

Mar 26 2026 7:31 AM | Updated on Mar 26 2026 7:31 AM

కరీంనగర్‌టౌన్‌: పెన్షనర్లకు ఆర్థిక నష్టం కల్గించేలా ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదించిన పెన్షన్‌ వాలిడేషన్‌ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కలెక్టరేట్‌ ఎదురుగా జిల్లా పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు ఉస్మాన్‌పాషా, మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్న చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు. పెన్షనర్ల సంఘం బాధ్యులు జీవీ.మనోహర్‌కుమార్‌గౌడ్‌, రామచంద్రం, నాగమోహన్‌, శంకరస్వామి, రాజిరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement