కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణశివారులోని కేసీ క్యాంపు వద్ద ఉన్న ఓ తోటలో శుక్రవారం మనిషిని పోలిన తల ఉన్నట్లు ఉండే వింత పక్షి కనబడింది. కాకతీయ కెనాల్ బ్రిడ్జి పక్కన ఉన్న తోటలో ఈ పక్షిని అడే ఉన్న కోతులు తరమడంతో ముళ్లపొదల్లో చిక్కుకుంది. తీవ్రంగా గాయపడగా.. గమనించిన భాస్కర్ అనే వ్యక్తి, నలుబాల వేణుగోపాల్ రక్షించి, పశు వైద్యాధికారి రవీందర్రెడ్డి వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. అనంతరం కరీంనగర్లోని డీర్ పార్కుకు తరలించారు.
– హుజూరాబాద్


