నక్కవాగు పరివాహక భూముల్లోని బోరుబావులు ఎత్తిపోయి, పంటలు ఎండిపోయాయి. నక్కవాగులోకి మల్లన్నసాగర్ జలాలను వదిలితే ఆరు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి యాసంగికి సాగు నీరు అందుతుంది. బోర్లు రీచార్జీ అవుతాయి.
– కట్ట బాపురావు, రైతు, బట్టోనితాళ్లు
చెరువుల్లో నీరు అడుగంటుతోంది
వేసవి ఎండలతో చెరువుల్లో నీరు అడుగంటుతోంది. బోర్లు పెద్దసంఖ్యలో ఉండగా నిరాటంకంగా నడుస్తున్నాయి. దీంతో చెరువులు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నీటిని పొదుపుగా వాడాలని రైతులను కోరుతున్నాం. మల్లన్నసాగర్ నీటి కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– రవికుమార్, డీఈఈ, ముస్తాబాద్


