కొత్త ఓటు.. అవగాహన లోటు
మానకొండూర్: సర్పంచ్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన నూతన ఓటర్లలో ఓటు ఏ విధంగా వేయాలో అవగాహన కరువు అవడంతో అయోమయానికి గురయ్యారు. చాలామంది నూతన ఓటర్లు ఈవీఎంల ద్వారానే ఓటు వేసుడని అనుకున్నారు. బ్యాలెట్ పేపర్పై ఓటు వేయాలని పోలింగ్ కేంద్రంలో తెలుసుకున్నాక అయోమయానికి గురయ్యారు.
నాకు తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఓటు వేసుడు ఏ విధంగానో నాకు తెలియదు. పోలింగ్ బూత్కు వెళ్లినప్పుడు కొంత కంగారుగా ఉండే. మొదటి సారి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉంది.
– రసజ్ఞ, గంగిపల్లి
నేను తొలిసారిగా ఓటు వేస్తున్నా. ఓటుహక్కు రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఈవీఎం ద్వారా ఓటు వేసుడనుకున్నా. బ్యాలెట్ పేపర్లో ఏ విధంగా ఓటు వేసుడో తెలియదు. అవగాహన కల్పించాల్సి ఉంది.
– మమత, గంగిపల్లి
తొలిసారి నాకు ఓటు హక్కు వచ్చి ంది. ఓటు వేయడం సం తోషంగా ఉంది. ఈవీఎంల ద్వారానే ఓటు వేసుడనుకుంటున్నా. ఓటు ఏ విధంగా వేయాలో తెలియ దు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలా వేయాలో తెలుసుకుంటా.
– కొలిపాక అఖిల( కొండపల్కల)
ఈవీఎంలు ఉంటాయనుకున్నా యువ ఓటర్లు
బ్యాలెట్ పేపర్లతో అయోమయం
కొత్త ఓటు.. అవగాహన లోటు
కొత్త ఓటు.. అవగాహన లోటు


