అక్రమంగా ఎరువుల బస్తాల తరలింపు | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా ఎరువుల బస్తాల తరలింపు

Sep 15 2025 8:35 AM | Updated on Sep 15 2025 8:35 AM

అక్రమంగా ఎరువుల బస్తాల తరలింపు

అక్రమంగా ఎరువుల బస్తాల తరలింపు

మానకొండూర్‌: మండలకేంద్రంలోని గ్రోమోర్‌ సెంటర్‌ నిర్వాహకులు రైతులకు అందించాల్సిన ఎరువుల బస్తాలను అక్రమంగా వ్యాన్‌లో తరలిస్తూ పట్టుబడ్డారు. స్థానికులు అందించిన స మాచారంతో మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌రెడ్డి మానకొండూర్‌కు చేరుకుని ఎరువుబస్తాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వ్యాన్‌లో 50 యూరియా, ఇతర ఎరువుల బస్తాలు ఉన్నట్లు తెలిపారు. వాటిని పరకాల నడికుడకు తరలిస్తున్నట్లు వివరించారు. అక్రమంగా ఎరువులు తరలిస్తున్న వారిపై 6 ఏ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అలాగే గ్రోమోర్‌ సెంటర్‌లో సుమారు రూ.20 లక్షల వివిధ రకాల ఎరువుల బస్తాలు ఉండగా, వాటి రిజిస్టర్‌, లేబుళ్లు సరిగా లేక సీజ్‌ చేశామని వ్యవసాయాధికారి వెల్లడించారు.

పట్టుకున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement