
జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు స్పందన
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు విశేష స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి సుమారు 150 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఈ నెల 25 నుంచి నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలంలో జరిగే రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కబడ్డీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర ఎల్లయ్యగౌడ్, సీహెచ్.మల్లేశ్, ప్రధాన కార్యదర్శి బుర్ర మల్లేశ్గౌడ్, పెటా కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు మాధవరెడ్డి, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.