
నాణ్యతలో తిరుగులేని భారతి సిమెంట్
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సిమెంట్ వ్యాపారరంగంలో తిరుగులేని ఏకై క సంస్థగా భారతి సిమెంట్ నాణ్యత, మన్నికలో వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటుందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజినీర్ సాగర్రెడ్డి అన్నారు. భారతి సిమెంట్ నేతృత్వంలో సోమవారం మండలకేంద్రంలో తాపీమేసీ్త్రలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సాగర్రెడ్డి మాట్లాడుతూ, భారతి సిమెంట్ వేరే సిమెంట్ కన్నా మూడురెట్లు మెరుగైనదని బిల్డర్స్, వినియోగదారులు, తాపీమేసీ్త్రలు చెప్పడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. వినియోగదారులకు ఉచిత సాంకేతిక సాయం, సలహాలు అందజేస్తూ ప్రత్యక్ష సంబంధాలు ఏర్పాటు చేసుకుందని వివరించారు. అనంతరం 50 మంది తాపీమేసీ్త్రలకు రూ.లక్ష ఉచిత ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక డీలర్ కానుగంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.