బెట్టింగ్‌ బారిన పడొద్దు | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ బారిన పడొద్దు

Apr 21 2025 8:19 AM | Updated on Apr 21 2025 8:19 AM

బెట్ట

బెట్టింగ్‌ బారిన పడొద్దు

● డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: బెట్టింగ్‌ అనేది ఒక ప్రమాదకరమైన వ్యసనమని, యువత బెట్టింగ్‌ బారిన పడొద్దని డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో స్టాప్‌ బెట్టింగ్‌...సేవ్‌ లైఫ్‌ నినాదంతో ఆదివా రం 2కే రన్‌ నిర్వహించారు. నగరంలోని మార్క్‌ఫెడ్‌ నుంచి తెలంగాణ చౌక్‌ వరకు 2కే రన్‌ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెట్టింగ్‌లతో యువత ప్రాణాలు కోల్పోతుండడం బాధాకరమన్నారు. యువత బెట్టింగ్‌ వైపు మళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 2కే రన్‌లో మొదటి బహుమతి గెలుచుకున్న వినయ్‌కి రూ.10 వేలు, రెండో బహుమతి గెలు చుకున్న రణధీర్‌కు రూ.5 వేలు, మూడోవిజేత సంజీవ్‌కు రూ.3 వేల నగదు అందజేశారు. యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు గుర్రం వాసు, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీని వాస్‌, నాయకులు వుట్కూరి నరేందర్‌రెడ్డి, కిమ్‌ ఫహద్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

జనసేనలోకి మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌?

కరీంనగర్‌: మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌ జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో మంతనాలు జరిపినట్లు వినికిడి. సీనియర్‌ నాయకుడిగా, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న సంతోష్‌కుమార్‌ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జనసేనలో చేరేందుకే ఉత్సాహంగా ఉన్నట్లు ఆయన వర్గీయులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో సంతోష్‌కుమార్‌కు విస్తృతమైన సంబంధాలు ఉండటం, సౌమ్యుడిగా పేరు ఉండటం కలిసి వచ్చే అంశంగా పేర్కొనవచ్చు. సంతోష్‌కుమార్‌తో పాటు కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు జనసేన పార్టీలోకి చేరేందుకే ఉత్సాహం చూపుతున్నట్లు వినికిడి. ఈ విషయమై సంతోష్‌కుమార్‌ను సంప్రదించగా ప్రస్తుతం తాను కాంగ్రెస్‌పార్టీలోనే కొనసాగుతున్నానని, జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఓ ఫంక్షన్‌లో కలిశానే తప్పా, చర్చలు అంటూ ఏం జరగలేదని వివరించారు.

బొట్టుపెట్టి.. సభకు ఆహ్వానించి

కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సంబరాల్లో భాగంగా ఈనెల 27వ తేదీన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగసభకు తరలి రావాలని కిసాన్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ మహిళా నా యకురాళ్లు సుల్తానా, సావనపల్లి నారాయణ మ్మ, సిరిపురం లావణ్య కోరారు. ఆదివారం ఇంటింటికీ తిరుగుతూ.. మహిళలకు బొట్టుపెట్టి సభకు రావాలని ఆహ్వానించారు. జిల్లానుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

నేటి ప్రజావాణి రద్దు

కరీంనగర్‌ అర్బన్‌: కలెక్టరేట్‌లో నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ పమేలా సత్పతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూ భారతి కొత్త ఆర్‌ఓఆర్‌ రెవెన్యూ చట్టం అమలు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహి స్తున్నామని, అధికారులంతా ఆ సదస్సులకు హాజరు కావలసిన ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని సూచించారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ మరమ్మత్తు పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.గోదాంగడ్డ ఫీడర్‌ పరిధిలోని శ్రీనగర్‌ కాలనీ, భవానీకాలనీ, సప్తగిరికాలనీ, తాహెర్‌ మజీద్‌, అంజనాద్రి ఆలయం, దోబీఘాట్‌, గోదాం, బీఎస్‌ఎఫ్‌ క్వార్టర్లు, ఏవోస్‌ పార్కుకాలనీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

బెట్టింగ్‌ బారిన పడొద్దు
1
1/3

బెట్టింగ్‌ బారిన పడొద్దు

బెట్టింగ్‌ బారిన పడొద్దు
2
2/3

బెట్టింగ్‌ బారిన పడొద్దు

బెట్టింగ్‌ బారిన పడొద్దు
3
3/3

బెట్టింగ్‌ బారిన పడొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement