మల్లాపూర్(కోరుట్ల): చెరువులో స్నానాకి వెళ్లి ఓ బాలుడు గల్లంతయిన ఘటన మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని లింగన్న చెరువు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని దుర్గమ్మకాలనీకి చెందిన పుట్ట పోశేట్టి–కవిత దంపతులకు ఇద్దరు కుమారులు రాజేశ్(12), నరేశ్. రాజేశ్ మండలంలోని మొగిలిపేటలో బాబాయి వద్ద ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఇటీవలే మల్లాపూర్కు వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. పశువుల కాపరి అయిన తండ్రి పోశేట్టికి చేదోడుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పశువులతో శివారు ప్రాంతానికి చేరుకున్న రాజేశ్ లింగన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండడంతో రాజేశ్కు ఈతరాక నీటిలో గల్లంతయ్యాడు. పోలీసులు ఘటనస్థలికి వెళ్లి గ్రామస్తులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో అర్ధరాత్రి వరకు గాలింపు చేపట్టినా రాజేశ్ ఆచూకీ లభించలేదని ఎస్సై రాజు తెలిపారు.
చెరువులో బాలుడి గల్లంతు