
సంతోష్నగర్లో వినాయకుని వద్ద గరుక పూజలో పాల్గొన్న మహిళలు
కరీంనగర్కల్చరల్: గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం నగరంలోని పలు మండపాల వద్ద పూజలు నిర్వహించారు. భజనలు, అర్చనలు, అన్నదానాలు చేశారు. 53వ డివిజన్లోని కాశ్మీర్గడ్డ, ముఖరాంపుర మండపాల్లో మేయర్ సునీల్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతోశ్నగర్లో గురుక పూజలు జరిపారు. గణేశ్నగర్లోని మండపం వద్ద 108 రకాల స్వీట్లను నైవేద్యంగా సమర్పించారు. జయంతి టవర్స్, శాసీ్త్రనగర్ వినాయకుడి వద్ద లక్ష పుష్పాలతో పూజ చేశారు. ఆయా మండపాల నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.