ఆయిల్‌ పాంతో అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ పాంతో అధిక లాభాలు

May 25 2025 8:14 AM | Updated on May 25 2025 8:14 AM

ఆయిల్

ఆయిల్‌ పాంతో అధిక లాభాలు

● కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ అర్బన్‌: ఆయిల్‌ పాంసాగుతో అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శనివారం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆయిల్‌ పాంసాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్లు ఆయిల్‌పాం తోటను కాపాడితే 30 ఏళ్ల పాటు ఆదాయం నిరంతరంగా వస్తుందని వివరించారు. ఆయిల్‌ పాంసాగుతో భూసారం పెంపుతో పాటు పర్యావరణానికి అనుకూలమని వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.

సేంద్రియ వ్యవసాయం అభినందనీయం

విద్యానగర్‌(కరీంనగర్‌): సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం అభినందనీయమని రెవెన్యూ డివిజనల్‌ అధికారి మహేశ్వర్‌ అన్నారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు గ్రహీత బొప్పు శ్రీహరి తన వ్యవసాయ క్షేత్రంలో పండించి, మాగపెట్టిన మామిడి పండ్లను శనివారం ఆర్డీవోకు అందజేశారు. ఈ సందర్భంగా సేంద్రియ సాగు చేస్తున్న శ్రీహరిని, ఆయన తనయులను ఆర్డీవో అభినందించారు. రసాయన ఎరువుల వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఆరోగ్య సంరక్షణకు దోహదపడే సేంద్రియ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి, సాగు వైపు దృష్టి సారించేలా కృషి చేయాలని సూచించారు.

ఉగ్రవాదుల గుండెల్లో ప్రళయ గర్జన

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

చొప్పదండి: ఆపరేషన్‌ సిందూర్‌ భారత సైన్యం ధైర్యానికి, అంకిత భావానికి నిదర్శమని, ఇది విరామం కాదని, ఉగ్రవాదుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రళయ గర్జన అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అభివర్ణించారు. భారత సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని, వారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నామని ప్రకటించారు. పట్టణంలో బీజేపీ నాయకులు శనివారం రాత్రి ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన నేపథ్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో కలిసి ఆయన యాత్రకు హాజరయ్యారు. కార్యక్రమంలో నాయకులు చేపూరి సత్యనారాయణ, బత్తుల లక్ష్మినారాయణ, సింగిరెడ్డి కృష్ణారెడ్డి, తోట కోటేశ్‌, బైరగోని కిట్టుగౌడ్‌, వైద రామానుజం, దూలం కళ్యాణ్‌, చిల్ల శ్రావణ్‌, మొగిలి మహేశ్‌, మంచికట్ల మల్లేశ్‌, బత్తిని ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల పాత్ర కీలకం

జిల్లా విద్యాధికారి జనార్ధన్‌ రావు

కొత్తపల్లి(కరీంనగర్‌): విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని డీఈవో సీహెచ్‌వీఎస్‌ జనార్ధన్‌ రావు అన్నారు. కొత్తపల్లి అల్ఫోర్స్‌ ఇటెక్నో స్కూల్‌లో నిర్వహిస్తున్న రెండోదశ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్‌ ప్రొగ్రాం ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమానికి డీఈవో హాజరై మాట్లాడారు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమని, అంతటి గౌరవం కలిగిన ఉపాధ్యాయులు నూతన విద్యవిధానంపై దృష్టి సారిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రత్యేక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ వి.నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ..మార్పులకనుగుణంగా ఉపాధ్యాయులు బోధించాలన్నారు. అనంతరం డీఈవో అల్ఫోర్స్‌ చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులను సత్కరించారు. కోర్స్‌ సమన్వయకర్త అశోక్‌ రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి జయపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్‌ పాంతో   అధిక లాభాలు1
1/2

ఆయిల్‌ పాంతో అధిక లాభాలు

ఆయిల్‌ పాంతో   అధిక లాభాలు2
2/2

ఆయిల్‌ పాంతో అధిక లాభాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement