దారి తొలగించి కుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

దారి తొలగించి కుల బహిష్కరణ

May 27 2025 12:03 AM | Updated on May 27 2025 12:03 AM

దారి

దారి తొలగించి కుల బహిష్కరణ

● శుభ, అశుభ కార్యక్రమాలకు దూరం ● రక్షణ కల్పించాలని ప్రజావాణిలో వేడుకోలు

కరీంనగర్‌ అర్బన్‌: నాగరిక సమాజంలో అనాగరిక చర్య ఇది. కుల పెద్దలు పెద్దరికం పేరిట దాష్టీకం ప్రదర్శించగా బాధిత కుటుంబం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్‌కు చెందిన శేరి చంద్రయ్య వ్యవసాయం, పశు పోషణతోపాటు కులవృత్తి అయిన చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ భూమికి వెళ్లేందుకు తాతలకాలం నుంచి దారి ఉండగా తమ సామాజికవర్గానికి చెందిన నలుగురు జేసీబీతో కందకంలా మార్చేశారని వాపోయాడు. చేపలు పట్టేందుకు వెళ్తే కులం లేదని నిరాకరించారని, కులం నుంచి బహిష్కరించినట్లు పేపర్‌ రాశారని రోదించారు. గ్రామంలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాల సమాచారం ఇవ్వవద్దని చెప్పగా ఎవరూ తమతో మాట్లాడటం లేదని వివరించారు.

మావోయిస్టు అధినేతను చంపితే నక్సలిజం పోతదా..

మూలాలను గుర్తించి పరిష్కరించకుండా హత్య చేయడం అప్రజాస్వామికం

సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్‌: మావోయిస్టు పార్టీ అగ్రనేత సెంట్రల్‌ కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావును తుద ముట్టించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం నక్సలిజం పోతుందని భ్రమ పడడం దురదృష్టకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక వీరుడు మరణిస్తే వేల మంది పుట్టుకొస్తారన్నారు. నక్సలిజం మూలాలను చర్చించి పరిష్కరించకుండా ఎన్‌కౌంటర్‌ పేరుతో హత్యలు చేయడం సరికాదని అన్నారు. ఈనెల 27, 28ల్లో కరీంనగర్‌ నగరంలోని మధు గార్డెన్‌లో జరిగే సీపీఐ జిల్లా 23వ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌ హాజరవుతున్నారన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, కొయ్యడ సృజన్‌కుమార్‌, బోయిని అశోక్‌, టేకుమల్ల సమ్మయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కిన్నెర మల్లమ్మ, కటికరెడ్డి బుచ్చన్నయాదవ్‌, బ్రాహ్మణపల్లి యుగేందర్‌, బోనగిరి మహేందర్‌, మచ్చ రమేశ్‌, కంది రవీందర్‌రెడ్డి తదితరులున్నారు.

దారి తొలగించి   కుల బహిష్కరణ1
1/1

దారి తొలగించి కుల బహిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement