నీటిగుంతలో మునిగి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

నీటిగుంతలో మునిగి యువకుడి మృతి

May 31 2026 2:00 AM | Updated on May 31 2026 2:00 AM

తాడ్వాయి(ఎల్లారెడ్డి): కృష్ణాజీవాడి గ్రామానికి చెందిన సర్జన ప్రవీణ్‌(23) అనే యువకు డు నీటిగుంతలో ఈత కు దిగి మునిగి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. ప్రవీణ్‌ మరికొంతమంది స్నేహితులతో కలిసి శనివారం మండలంలోని అబ్దుల్లా నగర్‌ శివారులో గల కంకర మిషన్‌ క్వారీ నీటిగుంతలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నేహితులు గుంతలో దిగి ఈత కొడుతుండగా ప్రవీణ్‌ కూడా స్నానం చేయడానికి నీటి గుంతలో దిగాడు. ప్రవీణ్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు గుంతలో నుంచి ప్రవీణ్‌ను బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం గ్రామంలో ఉన్న ఓ ఆర్‌ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. ప్రవీణ్‌ను చూసిన ఆర్‌ఎంపీ అప్పటికే మృతిచెందాడని ని ర్ధారించారు. మృతుడి తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement