ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అన్నారు. బుధవారం అడ్లూర్‌ ఎల్లారెడ్డి, ధర్మారావ్‌పేట్‌ గ్రామాల్లో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. రైతులకు నష్టం జరుగకుండా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలన్నారు. సర్పంచ్‌లు ఎడ్ల నర్సింలు, షేక్‌ ఉమర్‌, మాజీ జెడ్పీటీసీలు రాజేశ్వర్‌ రావు, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement