కామారెడ్డి క్రైం: రుణాల మంజూరు లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధ వారం కలెక్టరేట్లో డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు మంజూరు చేసి న రుణాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. బ్యాంకర్లు ప్రాధాన్యత రంగాలకు రుణాల మంజూరీ పెంచాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఎల్డీఎం చంద్రశేఖర్, అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: జన గణనలో భాగంగా మొదటి దశలో చేపట్ట నున్న గృహ జాబితా, గృహ గణన కార్యక్రమం మే 11 న ప్రారంభమవుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సర్వే నిర్వహించే క్లర్కులు, టీఏలు, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు కలెక్టరేట్లో మూడు రోజు ల పాటు నిర్వహించిన శిక్షణ గురువారం ముగిసింది. ము గింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జన గణనపై ప్ర తి అధికారి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నమో దు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అధికారులు పాల్గొన్నారు.


