● ఎగువ నుంచి కొనసాగుతున్న ఇన్ఫ్లో
● 34 గేట్ల ద్వారా లక్షా 28వేల
క్యూసెక్కుల నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుతూ పెరుగుతోంది. ఆదివారం ఉదయం 89 వేల క్యూసెక్కులకు తగ్గిన ఇన్ఫ్లో గంట తరువవాత లక్షా 16 వేలకు పెరిగి మళ్లీ 96 వేల క్యూసెక్కులకు తగ్గింది. తరువాత గంటకు లక్షా 28 వేల క్యూసెక్కులకు పెరిగింది. తరువాత మళ్లీ లక్షా 16 వేల క్యూసెక్కులకు తగ్గి మళ్లీ లక్షా 44 వేల క్యూసెక్కులకు పెరిగి సాయంత్రం వరకు నిలకడగా కొనసాగింది. ఇన్ఫ్లో తగ్గుతూ పెరుగుతుండడంతో అవుట్ఫ్లోను సైతం అదే విధంగా కొనసాగించారు. 34 గేట్ల ద్వారా గోదావరిలోకి లక్షా 28 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి అంతేస్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు.