
లోక్ అదాలత్లో భారీగా కేసుల పరిష్కారం
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద కోర్టులో న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ ఇరువర్గాల కక్షదారులకు మాట్లాడి లోక్ అదాలత్ కింద కేసులు పరిష్కరించారు. ఈ లోక్ అదాలత్లో 356 కేసుల పరిష్కరంకాగా, డ్రంక్ డ్రైవ్, సెటిల్మెంట్ ద్వారా రూ.23,67,360 రికవరీ చేశారు. న్యాయవాదులు లక్ష్మణరావు, మల్లేశ్వర్, విఠల్రావు, ప్రకాష్, విఠల్, బిచ్కుంద ఎస్సై మోహన్రెడ్డి, మద్నూర్ ఎస్సై విజయ్కొండ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో ..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో 441 కేసుల పరిష్కరంకాగా, సెటిల్మెంట్ ద్వారా రూ.13,98,145 రికవరీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు గోపాల్రావు, పండరి, శ్రీనివాస్, నవీద్, సాయిప్రకాష్ , శ్రీకాంత్, సాయిబాబా, సతీ ష్, ఎకై ్సజ్సీఐ షాకీర్ అహ్మద్ తదితరులున్నారు.
బాన్సువాడ కోర్టులో..
బాన్సువాడ రూరల్: లోక్ అదాలత్తో కేసులు సత్వర పరిష్కారం అవుతాయని బాన్సువాడ సివిల్కోర్టు న్యాయమూర్తి టీఎస్పీ భార్గవి అన్నారు. కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించి మాట్లాడారు. ఈ లోక్ అదాలత్లో 300 కేసుల పరిష్కరంకాగా, సెటిల్మెంట్ ద్వారా రూ.16,23, 222 రికవరీ చేశారు.ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ మోహన్రెడ్డి, న్యాయవాదులు ఖలీల్, దత్తాత్రేయ, మోగులయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

లోక్ అదాలత్లో భారీగా కేసుల పరిష్కారం

లోక్ అదాలత్లో భారీగా కేసుల పరిష్కారం