
జొన్న కొనుగోలు పరిమితి పెంపుపై హర్షం
మద్నూర్/నిజాంసాగర్ (జుక్కల్): రైతుల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో, నిజాంసాగర్ మండలం అచ్చంపేట సొసైటీ కార్యాలయం ఆవరణలో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతు ప్రభుత్వ జొన్న కొనుగోలు పరిమితిని ఎకరాకు 8 క్వింటాళ్ల నుంచి 14 క్వింటాళ్ల వరకు పెంపుపై వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి తీసుకువెళ్లి కృషి చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సలాబత్పూర్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రాంపటేల్, సొసైటీ చైర్మన్ శీను పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, నాయకులు రైతులు పాల్గొన్నారు.