భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకం | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకం

Apr 21 2025 8:19 AM | Updated on Apr 21 2025 8:19 AM

భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకం

భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకం

భిక్కనూరు: భవిష్యత్తుకు విద్యార్థి దశ పునాది లాంటిదని సాంఘిక సంక్షేమ గురుకులాల రిటైర్డ్‌ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ తులసీదాస్‌ అన్నారు. ఆదివారం భిక్కనూరు గురుకుల కళాశాలలో నిర్వహించిన 2007–08 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆ

త్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. 18 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మాజీ ప్రిన్సిపాల్‌ జనార్దన్‌, టీచర్లు గులాం యస్‌దాని, నర్సింగ్‌రావు, నగేశ్‌, అమర్నాద్‌, రమేశ్‌, రాంచంద్రబాబు, సురేందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement