పెద్దాపురంలో..
పెద్దాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ దొరబాబు, నేతలు కలసి ఆలయంలో 108 కొబ్బరి కాయలు కొట్టారు. అక్కడి నుంచి మెయిన్ రోడ్డులో పాదయాత్ర చేసి, ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని, పూజలు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, అయ్యెరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు గవరసాన సూరిబాబు, మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు తదితరులు పూజల్లో పాల్గొన్నారు.


