
గాలికుంటు.. తరిమికొట్టు
15 నుంచి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం
జిల్లాకు చేరుకున్న 1.25 లక్షల డోసులు
వర్షాకాలంలో వ్యాధి తీవ్రత ఎక్కువ
రాయవరం: గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు దున్నాలన్నా, దుక్కి చేయాలన్నా ఎద్దులు, దున్నల అవసరం తప్పనిసరి. వీటితో పాటు పాడి పశువులు బాగుంటేనే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. అయితే ఎద్దులు, దున్నలు, ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) సోకే ప్రమాదం ఉంది. వైరస్ కారణంగా వచ్చే ఈ వ్యాధి ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. దీని బారిన పడిన పశువుల్లో ఉత్పాదకత తగ్గిపోతుంది. తద్వారా పశు పోషకులకు తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతుంది. అయితే సరైన చికిత్సా విధానాలు పాటిస్తే పశువులు, జీవాలను ఈ వ్యాధి బారి నుంచి కాపాడుకోవచ్చని పశువైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకూ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనున్నారు.
జిల్లాలో పరిస్థితి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,65,368 పశువులు ఉన్నాయి. వీటికి 7వ రౌండ్ బూస్టర్ డోస్ ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకూ ఉచితంగా వేయనున్నారు. అక్టోబర్ 15 నుంచి నెలాఖరు వరకు ఏడాది లోపు దూడలకు బూస్టర్ డోస్ వేస్తారు. జిల్లాకు 1.65 లక్షల డోసులు అవసరం కాగా, 1.25లక్షల డోసులు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. గతంలో 40 వేల డోసుల నిల్వలు ఉన్నాయి.

గాలికుంటు.. తరిమికొట్టు