సర్వేల భారం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

సర్వేల భారం తగ్గించాలి

Mar 23 2025 12:16 AM | Updated on Mar 23 2025 12:14 AM

జాబ్‌ చార్ట్‌లో పేర్కొన్న పనులకు తోడు కాలానుగుణంగా ప్రభుత్వం అదనంగా అప్పగించే విధులను ఉద్యోగులు నిర్వర్తించాల్సి వస్తోంది. కొన్ని సందర్భానుసారం చేసేవి కాగా, మరికొన్ని నిరంతరం చేయాల్సిన పనులు. వీటితో ఇటు సచివాలయ ఉద్యోగులు, అటు వీఆర్‌ఓలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పింఛన్ల దగ్గర నుంచి ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్య పరిష్కారంలో తలమునకలవుతున్న వారిపై అదనపు సర్వేల పేరుతో భారం మోపుతున్నారు. దీంతో, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడితో చాలా మంది వీఆర్‌ఓలు, సచివాలయ ఉద్యోగులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. వీరిపై సర్వేల భారం తగ్గించాలి.

– దువ్వా శేషుబాబ్జీ,

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement