గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 1,997 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.7,571, కనిష్టంగా రూ.5,470, సరాసరిగా రూ.6,659 ధరలు లభించాయి. అలాగే 363 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,604, కనిష్టంగా రూ.6,019, సరాసరిగా రూ.6,229 ధరలు పలికాయి. 17 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,019, కనిష్టంగా రూ.5,909, సరాసరిగా రూ.6,011 చొప్పున వచ్చాయి. 104 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,310, కనిష్టంగా రూ.2,160, సరాసరిగా రూ.2,205 ధరలు లభించాయి.


